నల్లగొండ, మే 02 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లలోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలిపోవడంతో ఒక కార్మికుడు బొడ్డు బాలకృష్ణ (30) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మృతుడు బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.1.50 కోట్లు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. గాయపడ్డ వారిలో నలుగురు స్వల్ప గాయాలతో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ముగ్గురు కార్మికులు ప్రస్తుతం అపోలో డీఆర్డీఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నోష్ ఫార్మాలో నెల రోజుల వ్యవధిలో ఈ యూనిట్లో ఇది రెండవ ప్రమాదం. మార్చి 9న జరిగిన ఇలాంటి పేలుడులో ఇద్దరు కార్మికులు గాయపడడంతో భద్రతా నిబంధనల పాటింపుపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. తాజాగా కంపెనీ మూడో బ్లాక్లో రియాక్టర్లోకి ముడి పదార్థాలను నింపుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.