నల్లగొండ : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ భార్య భవానితోపాటు తల్లి నోముల లక్ష్మి కరోనా బారినపడ్డారు.
ఉప ఎన్నిక ముగిసిన అనంతరం తన వద్ద పనిచేసే సిబ్బందితోపాటు కుటుంబీలకు జిల్లా కేంద్రంలో భగత్ కొవిడ్ పరీక్ష చేయించగా ఆయన భార్యతోపాటు తల్లికి పాజిటివ్ వచ్చింది.
సిబ్బందిలో ఎవరూ వైరస్ బారినపడలేదని తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
నోముల భగత్ కరోనా బారినపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంపై ఆయన స్పందించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు.
ఇదిలాఉండగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డితోపాటు ఆయన కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. సాగర్ ఉప ఎన్నికలో భాగంగా 20 రోజులపాటు నియోజకవర్గ వ్యాప్తంగా కోటిరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి