బోధన్, ఆగస్టు 29 : పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని ఏసీపీ కిరణ్కుమార్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో సోమవారం శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలను పాటించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులకు సహకరించాలని సూచించారు. పోలీసుశాఖ సూచనలను గణేశ్ మండపాల నిర్వాహకులు పాటించాలన్నారు. సమావేశంలో మున్సిపల్శాఖ కమిషనర్ రామలింగం, పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్కుమార్, జి.శ్రీనివాసరాజు, ఎస్సైలు, వినాయక మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్, ఆగస్టు 29 : మండల కేంద్రంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి నార్త్ రూరల్ సీఐ నరహరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గణేశ్ మండపాలు ఏర్పాటు చేసే యూత్ సంఘాల సభ్యులు మాక్లూర్ పోలీస్స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద రాత్రి సమయంలో యూత్ సభ్యు లు ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. డీజే ఏర్పాటు చేయొద్దని, సోదరభావంతో ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ శంకర్, ఏఎస్సై గంగాధర్, సర్పంచ్ అశోక్రావు, కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, గంగోనే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.