మిర్యాలగూడ రూరల్, జనవరి 31 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం వెంకటాద్రిపాలెం, జంకుతండా, అవంతీపురం, లావూడి తండా గ్రామాల్లో రూ.80 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ, విద్యుత్ రంగాలను పటిష్టం చేసి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారన్నారు. చెరువుల అభివృద్ధితో పాటు కొత్త ప్రాజెక్టులు, ఎత్తి పోతలు, చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటి కరువు లేకుండా చేశారన్నారు. పారిశ్రామికంగానూ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలనకూ టీఎస్పీఎస్సీ ద్వారా వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
అనంతరం మండలంలోని జంకుతండా, వీటీపాలెం, తుంగపహాడ్, లావూడితండా, జప్తివీరప్పగూడెం, బి.అన్నారం, చింతపల్లి, కొత్తగూడెం, రుద్రారం, లక్ష్మీపురం, కొత్తపేట, రాయినిపాలెం, ఆలగడప, అవంతీపురం, యాద్గార్పల్లి, ఊట్లపల్లి, తక్కెళ్లపహాడ్, భగ్యగోపసముద్రంతండా, వాటర్ట్యాంక్ తండాల్లో రూ.3 కోట్లతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, సమితి మండలాధ్యక్షుడు ఏడుకొండలు, జిల్లా డైరెక్టర్ చౌగాని భిక్షం గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబూనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సైదులు, ఉపాధ్యక్షుడు పూసపాటి రాజయ్య, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, పీఆర్ డీఈ వెంకటేశ్వర్రావు, ఏఈ ఆదినారాయణ, ఎంపీఓ వీరారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
మిర్యాలగూడ : తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త సంవత్సర క్యాలెండర్ను మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నాయకులు ధనావత్ చిట్టిబాబూనాయక్, నూకల హన్మంతరెడ్డి, చాంద్పాషా, హబీబ్, నఫీ సిద్దీక్అహ్మద్, దస్తగీర్, సాజిద్, మహమూద్అలీ, అహ్మద్ హుస్సేన్పాషా, కలీం, జానీపాషా, ఇంతియాజ్, ఇనాయతుల్లా, ఖాసీంబాబా, జమాల్, అబ్బాస్అలీ పాల్గొన్నారు.