నేరేడుచర్ల, ఫిబ్రవరి 11 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేళ్లచెర్వు మండలంలోని ఈ నెల 18నుంచి 23వరకు ఎండ్ల పందేలు నిర్వహించనున్నారు. ఎడ్ల పందేలకు సంబంధించిన వాల్పోస్టర్లను శానసభా ప్రాంగణంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఇష్టకామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పి.శంకర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బి.బసవయ్య, ఇమ్రాన్ పాల్గొన్నారు.
మంత్రులకు ఆహ్వానం
మేళ్లచెర్వులో ఈ నెల 18నుంచి 22వరకు జరుగనున్న మహా శివరాత్రి జాతర, ఎద్దుల పందేల ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ ఎమ్మెల్యే సైదిరెడ్డి నేతృత్వంలో స్థానిక నాయకులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి వేర్వేరుగా శనివారం ఆహ్వానపత్రికలు అందించారు. ఆహ్వాన పత్రికలు అందించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరిశెట్టి బసవయ్య, బోగాల బాల వెంకట్రెడ్డి, సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, నాయకులు వర్రా వెంకట్రెడ్డి, బుస్సా శ్రీనివాస్, అశోక్ ఉన్నారు.