నందికొండ, జనవరి 9 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య విశేష కృషి చేశారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. నోముల నర్సింహయ్య జయంతిని పురష్కరించుకొని నందికొండ హిల్కాలనీ నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన నోముల నర్సింహయ్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నోముల నర్సింహయ్య కృషితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నందికొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. నర్సింహయ్య చొరువతోనే పెద్దవూర, తిరుమలగిరి మండలంలోని భూ నిర్వాసితులకు 80 శాతం మందికి పట్టాలు వచ్చాయన్నారు.
అనంతరం ఎమ్మెల్యే హిల్కాలనీలోని తన నివాసంలో పర్వేదుల గ్రామంలోని 44 మంది నిరుపేదలకు భూ పట్టాలను ఎమ్మార్వో సైదులు గౌడ్తో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జడ్పీటీసి అబ్బిడి కృష్ణారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ అనుషారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, సంపత్కుమార్, వైస్ చైర్మన్ మందరఘువీర్, కౌన్సిలర్లు రామకృష్ణ, రమేశ్జీ, ఇందిరా, మంగ్తానాయక్ పాల్గొన్నారు.
జనహృదయ నేత నోముల నర్సింహయ్య : ఎమ్మెల్యే భగత్కుమార్
హాలియా, జనవరి 9 : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జనహృదయ నేత అని, ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. నోముల నర్సింహయ్య 67వ జయంతి సందర్భంగా నోముల ఎన్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను హాలియా మినీ స్టేడియంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, బీఆర్ఎస్ నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్కుమార్ తన తండ్రి నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. నోముల నర్సింహయ్య పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడిన యోధుడన్నారు. నర్సింహయ్య ఆశయాలను నెరవేర్చడం తన బాధ్యత అన్నారు.
పేదల అభ్యున్నతికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషి చేశారని హాలియా మున్సిపల్ చైర్పర్సన్ పార్వతమ్మాశంకరయ్య అన్నారు. సోమవారం హాలియాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నోముల నర్సింహయ్య 67వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమాల్లో హాలియా, నిడమనూరు మార్కెట్ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాధం సంపత్కుమార్, జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కే.వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నాయకులు ఎన్నమల్ల సత్యం, దోరేపల్లి వెంకన్న, లక్ష్మణ్, అభినయ్, ఎస్ఐ క్రాంతికుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రాంబాబు, యూత్ అధ్యక్షుడు సైదాచారి, వెంకటయ్య,సత్యం,మట్టారెడ్డి, లక్ష్మణ్, లింగయ్య, సైదులు, వెంకన్న, బి. సైదులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిడమనూరు : దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నోముల భగ త్కుమార్ అన్నారు. నర్సింహయ్య 67వ జయంతి సందర్భంగా మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహ్మయ్య విగ్రహానికి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నర్సింహయ్య నేటి తరానికి ఆదర్శ ప్రాయుడన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు తాటి సత్యపాల్, బహునూతల నరేందర్, మార్కెట్ మాజీ చైర్మన్ జానయ్య, రవియాదవ్, సర్పంచులు స్వాతీఅశోక్, రాంబాబు, రామలింగమ్మారవి, ఎంపీటీసీ సం తోష్, మార్కెట్ వైస్ చైర్మన్ రామలింగయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, దాసు, కళావతి, కొండల్, వెంకటాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
త్రిపురారం : మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నోముల నర్సింహయ్య జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్స్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ జానయ్య, మహిళా ప్రధాన కార్యదర్శి వనజ, శ్రీనివాసరెడ్డి, వెంకటాచారి, శ్రీను, దస్తగిరి, రాము పాల్గొన్నారు.