దేవరకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. గురువారం పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను, కొండ మల్లేపల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రత్యక్ష తరగతుల ద్వారా విద్యాబోధన అందించాలని ఉపా ధ్యాయులకు సూచించారు.
పాఠశాలకు హజరుకాని విద్యార్థులకు బలవంతంగా పాఠశాలకు రావాలనే నిబంధనలు పెట్టొద్దన్నారు. అనంతరం ఎంత మంది విద్యార్థులు హాజరు అవుతున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతిగదిలోకి వెళ్లి విద్యార్థులను పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. బాలికల పాఠశాల వెనుక వైపు ప్రహరీ లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా రు. బాలుర పాఠశాలలో విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా మల్లేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులను బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదన పు కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, కమిషనర్ వెంకటయ్య హెచ్ఎం రెబాకా, నాళ్ల గోవర్దన్, సత్యనారాయణ ఉపాధ్యా యులు, విద్యార్థులు ఉన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి: జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
గుర్రంపోడు: విద్యార్థులందరూ కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నా రు. గురువారం మండలంలోని కొప్పోలు జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రత్యక్ష తరగతులు, ఆన్లైన్ తరగతులల్లో ఏవి బాగున్నాయ ని అదనపు కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించగా తమకు ప్రత్యక్ష తరగతులు బాగున్నాయని, పాఠాలు బాగా అర్ధమవుతున్నాయని, స్నేహితులం దరం కలిసి ఉత్సహంగా ఉన్నామని జవాబిచ్చారు.
ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని అన్నారు. వంట గదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మండలంలోని అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుకునేలా పర్య వేక్షించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీపాథ సుధాకర్, ఎంఈవో తరి రాములు, హెచ్ఎం శ్రీనయా చారి, ఉపాధ్యాయులు ఉన్నారు.