Char Dham Yatra | చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం, వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ మార్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతోచార్ ధామ్ యాత్రను సోమవారం (జూలై 20, 2026) తాత్కాలికంగా నిలిపివేశామని అని అధికారులు తెలిపారు.
ప్రతికూల వాతావరణం(Heavy rains) దృష్ట్యా ఏ యాత్రికుడిని ముందుకు వెళ్లనివ్వకుండా చూడాలని స్థానిక అధికారులను యంత్రాంగం ఆదేశించింది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే చార్ధామ్ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైన విషయం తెలిసిందే.