రామగిరి, ఏప్రిల్ 5 : అత్యాధునిక ఫీచర్స్తో కలిగి ఉన్న హైఎండ్ హెహికల్స్ కోసం చూస్తున్నారా? బెంజ్, ఆడి, ఓల్వో వంటి వాహనాలను లైవ్లో చూసి వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిందేనా! అని మదన పడుతున్నారా? నచ్చిన వాహనం ఎంపిక చేసుకునేందుకు, వివిధ కంపెనీల ధరలు, ఫీచర్స్తో కంపేర్ చేసుకునేందుకు ఒక వేదిక ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా! ఇలాంటి ఆలోచనలకు పరిష్కారంగానే నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే దినపత్రికలు ఆటోషో ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రముఖ కంపెనీల వాహనాలను సైతం వినియోగదారుల వెసులుబాటు కోసం నల్లగొండ జిల్లాకేంద్రానికి రప్పిస్తున్నాయి.
నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) వేదికగా శని, ఆదివారాల్లో నిర్వహించే మెగా ఆటో షోను నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నది. సందర్శకులకు ఉచిత ప్రవేశం కలదు. లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనున్నారు. ప్రముఖ కంపెనీల కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు నల్లగొండలో అందుబాటులోనేని మెర్సిడెజ్ బెంజ్, వోల్వో వంటి కంపెనీల వాహనాలను సైతం ఆయా
కంపె నీలు ఆటోలో ప్రదర్శనకు ఉంచనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆటో షో కొనసాగనున్నది.