మిర్యాలగూడ: తెలంగాణా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగానే సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద కుటుంబాలకుచెందిన వారు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి సీఎం కేసీఆర్ కార్పొరేటు వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయాన్ని అందించి ఆదుకుంటున్నారని అన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. అహర్నిశలు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి,మగ్దూం పాష, రవి ఉన్నారు