రామగిరి: తెలంగాణ విద్య యావత్ భారతదేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించి అంకిత భావతంతో పనిచేయాలన్నారు. నల్లగొం డ జిల్లా పీఆర్టీయూ టీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఆ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పూల రవీంద ర్తో కలిసి మంగళవారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి నూతన కమిటీని అభినందించి మాట్లాడుతూ కరోనాతో విద్యారంగం ఒకింత ఇబ్బంది పడిందన్నా రు. కరోనా వంటి పరిస్థితులను అధిగమించి విద్యార్థులకు విద్యనందిస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలోపేతం అవుతున్నదన్నారు. అందుకు గురుకు లాల ద్వారా అందిస్తున్న విద్యతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు.
విద్యాభివృద్ధికి నల్లగొండ జిల్లాలో పీఆర్టీయూ నూతన కమిటీ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అదేవిధంగా నూతన నల్లగొం డ జిల్లా పీఆర్టీయూ టీఎస్ నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సుంకరి భిక్షంగౌడ్, కాళం నారాయణరెడ్డిలతో పాటు అం దరినీ సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ మాజీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరం జన్రెడ్డి, బసిరెడ్డి రవీందర్రెడ్డి, డీవీఎన్ ఫణికుమార్, జానారెడ్డి, జనగాం వెంకన్నగౌడ్, యూసూఫ్, రమణ పాల్గొన్నారు.