నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 25 : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించిందని, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియన్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల గర్ల్స్-1లో జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
బీసీ గురుకులాల మాదిరిగానే మైనార్టీ గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం బాటలు వేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.1.25 లక్షల ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నదని తెలిపారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతంగా ఎదుగాలని, క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయేందర్రెడ్డి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.