నల్లగొండ రూరల్: టీఆర్ఏస్ సర్కార్తోనే రాష్ట్రంలో సామాన్యుడికి సైతం న్యాయం జరుగుతుందని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మళ్లీ టీఆర్ఎస్ పార్టీదే అధికారమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నా రు. అదివారం స్థానిక క్యాంపు కార్యలయంలో సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ నల్లగొండ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశం గర్వించదగ్గ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. నవంబర్ 15న వరంగల్ జరిగే విజయ గర్జన సభకు భారీగా తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం నల్లగొండ మండలంలోని 49 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 16 లక్షల 82 వేల 500 చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, సర్పంచ్ మన్నెం కృష్ణార్జున్రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్ గౌడ్, బడుపుల శంకర్, చింత సైదులు, ధనలక్ష్మి, విమలమ్మ, రజిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు ,గ్రామ శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.