నందికొండ, జూలై 29 : శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి నిలకడగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ జలకళను సంతరించుకుంటుంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 63,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగుకులకు గాను ప్రస్తుతం 553.40 (217.3314 టీఎంసీ) అడుగుల మేర నీరు నిల్వ ఉన్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండటానికి ఇంకా 47(95 టీఎంసీ) అడుగుల మేర నీరు చేరాల్సి ఉన్నది. రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో ఆశాజనకంగా ఉండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు వానకాలం పంటకు నీటి విడుదలను ప్రారంభించారు. కుడికాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎడమ కాల్వ ద్వారా 717 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. జలాశయానికి 63,512 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 2,367 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుతం 879.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. 59,065 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
తగ్గుతున్న ఇన్ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శుక్రవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. మూడు రోజులుగా ప్రాజెక్టు ఎగువ నుంచి భారీగా కొనసాగిన ఇన్ఫ్లో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 2,171.63 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. 5487.92 క్యూసెక్కుల నీరు వస్తున్నది. కుడి కాలువకు 259.54, ఎడమ కాలువకు 129.77 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎం సీలు) అడుగులు కాగా ప్రస్తుతం 638.10 అడుగు లుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.