దేవరకొండ, ఫిబ్రవరి 21 : బంజారాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేసిన సంత్ సేవాలాల్ మహనీయుడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ జయంతిని దేవ రకొండ బంజారాభవన్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాలాల్ సేవలను గుర్తించి ఆయన జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. గతంలో సేవాలాల్ జయంతి బంజారా ప్రజలకు సైతం తెలియదని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సేవాలాల్ జయంతి వేడుకల నిర్వహణకు రూ. 3.15లక్షలు మంజూరు చేశారన్నారు. దేశంలోనే సంత్ సేవాలాల్ను గిరిజనులు ఎవ్వరూ మర్చిపోలేరన్నారు. బ్రిటీషులతో పోరాడి భారత దేశంలో బంజారాలను ఐక్యంగా చేసిన మహనీయుడని ఆయన తెలిపారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని శాసన సభలో సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడం పట్ల గిరిజన పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర రాజధానిలో గిరిజనుల కోసం భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ను సన్మానించారు. ముందుగా ఆలయం లో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలోఆర్డీఓ గోపీరాం, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, జడ్పీటీసీ బాలూనాయక్, తాసీల్దార్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, గిరిజన బంజారా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్కుమార్ జాదవ్, డివిజన్ అధ్యక్షుడు లక్ష్మానాయక్, డాక్టర్ వడ్య్తా రవినాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్నాయక్, పీఏసీఎస్ చైరన్లు జాల నర్సింహారెడ్డి, డాక్టర్ దూదిపాల వేణుధర్రెడ్డి, ముక్కమాల వెంకటయ్యగౌడ్, పంతులాల్, పాపా నాయక్, నాగేశ్వర్నాయక్, శంకర్నాయక్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య పాల్గొన్నారు.
గిరిజనులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే
రామగిరి : గిరిజనుల అభివృద్ధ్దికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని గడియారం సెంటర్లో సోమవారం నిర్వహించిన సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తొలుత హోమం, తర్వాత సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి మాట్లాడారు. గిరిజన బిడ్డల చదువులకు ఒక్కొక్కరికి రూ.1.20 ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయిలో గురుకుల విద్యను అందుబాటుకి తెచ్చారని గుర్తుచేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని తెలిపారు. నల్లగొండలో బంజారాభవన్కు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఏటీడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్నాయక్, కౌన్సిలర్లు ప్రదీప్నాయక్, శ్రీను, అభిమన్యు శ్రీనివాస్, గిరిజన సంఘాల నాయకులు రవినాయక్, బద్రునాయక్, నాయకులు జమాల్ఖాద్రీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లిరామరాజు, ప్రధానకార్యదర్శి బోనగిరి దేవేందర్ పాల్గొన్నారు.