నందికొండ, ఫిబ్రవరి 21:ప్రతియేటా వరదల అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్కు మరమ్మతులు చేపడుతారు. ఈ ఏడాది పలు పనుల కోసం ఎన్ఎస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాంతో కొన్ని పనులను ప్రారంభించగా మరికొన్ని త్వరలో మొదలు కానున్నాయి.
గోడలకు రంగులు
మరమ్మతుల్లో భాగంగా ప్రధాన ఎర్త్ డ్యామ్పైన రోడ్లు, డ్యామ్ ప్రహరీ గోడలకు రంగులు, ఎడమ, కుడి కాల్వ గేట్ల పనులు చేపట్టనున్నారు. రూ.10 లక్షలతో నాగార్జునసాగర్ డ్యాం ప్రహరీ గోడలకు, ఎడమ కాల్వ వద్ద ఉన్న రక్షణ గోడలకు రంగులు వేస్తారు. ప్రధాన డ్యామ్ రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ వెంట ఏర్పాటు చేసిన వైర్లు కనిపించకుండా కవర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి పనులను ఇప్పటికే ప్రారంభించారు. రూ.1.20 కోట్లతో ప్రధాన డ్యామ్పైన 1.5 కిలోమీటర్లు, ఎర్త్ డ్యామ్పై 2.5 కిలోమీటర్లు మొత్తం 4 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పనులకు ఈ నెల 25వ తేదీలోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎడమ కాల్వ 3 గేట్లు, కుడి కాల్వ 8 గేట్ల మరమ్మతులకు రూ.7 కోట్లు మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. డ్యామ్ స్పిల్వేలో ఏర్పడిన గుంతల మరమ్మతులకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.
మరమ్మతుల పనులు ప్రారంభించాం
డ్యామ్ పటిష్టతకు ప్రతియేటా మెయింటెనెన్స్ పనులు చేపడుతాం. ఇందులో గోడలకు రంగులు వేయడంతోపాటు ఫుట్పాత్ వైర్లు కనిపించకుండా ప్రస్తుతం కొన్ని పనులు ప్రారంభించాం. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా కొన్ని నిధులు మంజూరు కాగా మరికొన్ని రావాల్సి ఉన్నది.
– ధర్మానాయక్, నాగార్జునసాగర్ డ్యామ్ ఎస్ఈ