రామగిరి, డిసెంబర్ 17: యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని.. అన్ని వయస్సుల వారు నిత్యం యోగా సాధన చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, పీడీలకు అందిస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నేర్పించాలన్నారు. శిక్షణ పొందిన పీఈటీలు, పీడీలకు ఎంవీ గోనారెడ్డి, యా నాల ప్రభాకర్రెడ్డి, గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా టీషర్ట్స్ అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఈఓ కార్యాలయ ఏడీ రామాచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేప అంతమ్మకు ఎమ్మెల్యే నివాళి
నల్లగండ రూరల్ : బీఆర్ఏస్ నల్లగొండ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి నాయనమ్మ దేప అంతమ్మ(95) మరణించింది. శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మధుసూధన్రెడ్డి, టీ. క్రిష్ణ, వెంకన్న, విజయ్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు ఉన్నారు.
శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే పరామార్శ
కనగల్ : మండలంలోని దోరెపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఏమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ అపరేషన్ చేయించుకున్నాడు. శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆయన్ను ఆసుపత్రిలో పరామర్శించారు.