నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ కోటిరెడ్డి చేత ప్రమాణం చేయించారు. మంత్రులు జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ జాఫ్రీ శాసన మండలి నిబంధనావళితోపాటు ప్రత్యేకంగా బ్యాగును అందించి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఎంసీ కోటిరెడ్డిని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామ్చందర్నాయక్ శాసనమండలి ఆవరణలోనే కోటిరెడ్డిని సన్మానించి అభినందించారు. ఎమ్మెల్సీగా జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల బలోపేతం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. తిరుమలగిరి (సాగర్)ఎంపీపీ భగవాన్నాయక్, మేడే రాజీవ్సాగర్, జిల్లా శంకర్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ను కలిసిన ఎంసీ కోటిరెడ్డి
పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రగతిభవన్లో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి స్పందిస్తూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. సాగర్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ సారథ్యంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. అందరితో కలిసి సమష్టిగా జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
తరలివెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు
ఎమ్మెల్సీగా ఎంసీ కోటిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. హాలియా నుంచి ఎంపీపీ పేర్ల సుమతీ పురుషోత్తం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, పోశం శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, చల్లా మట్టారెడ్డి, అబ్దుల్ హలీం, అంజత్ఖాన్, జలీల్, బెడుదూరి వెంకట్రెడ్డి, ఆవుల సైదులు, బందిలి సైదులు, మొగలయ్య తరలివెళ్లారు.
గుర్రంపోడు నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్గౌడ్, పార్టీ మండలాధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రావులపాటి భాస్కర్, ఎంపీటీసీలు, సర్పంచులు అభినందించారు.
త్రిపురారం మండలం నుంచి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామ్చందర్నాయక్ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్సీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి, భరత్రెడ్డి, బైరం కృష్ణ, అనుముల శ్రీనివాస్రెడ్డి, అనంతరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ధనావత్ ధన్సింగ్నాయక్, రాంచంద్రయ్య, రవినాయక్, కలగాని శ్రవణ్, జయరాంనాయక్ పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) : మండల నాయకులు ఎమ్మెల్సీ కోటిరెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాగం శ్రవణ్కుమార్రెడ్డి, జడ్పీటీసీ సూర్య, నాయకులు రాఘవరెడ్డి, షేక్ రహీం, శ్రీను, మంగ్తా, కృష్ణ, సురేశ్ పాల్గొన్నారు.
నిడమనూరు : ఎమ్మెల్సీని అభినందించిన వారిలో వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ.రామారావు, మన్నెం రంజిత్ యాదవ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంకతి వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం చిన్నవీరయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ కేశబోయిన జానయ్య గౌడ్, నాయకులు గోపు రమణారెడ్డి, మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, రాంబాబు, వెంకట్రెడ్డి, సీహెచ్.శ్రీను, బత్తుల సుజయ్, బుర్రి పరమేశ్ ఉన్నారు.
రామాలయంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి పూజలు
వేములపల్లి : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు హైదరాబాద్కు వెళ్తూ.. మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండి యాదగిరిరెడ్డి, నాయకులు శంకర్రెడ్డి, దామోదర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దుర్గారెడ్డి, న్యాయవాదులు మాలి ఉమాశంకర్రెడ్డి, జిల్లెపల్లి శ్రీనివాస్, జడ మట్టయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.