కోదాడ రూరల్, డిసెంబర్ 16 : గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. స్థానిక సిమెంటు పరిశ్రమ అందించిన రూ.25లక్షల ఆర్థిక సాయంతో మండలంలోని కూచిపూడిలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావం అనంతరం పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, సర్పంచ్ శెట్టి సురేశ్నాయుడు, ఎంపీటీసీ శంకర్శెట్టి కోటేశ్వర్రావు, కోఆప్షన్ మండల సభ్యుడు ఎస్కె.ఉద్దండు, టీఆర్ఎస్ నాయకులు శేషు, తిరుపతయ్య, బాబూరావు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
మోతె, డిసెంబర్ 16 : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అన్ని పండుగల్లో భాగస్వామ్యమై ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద శ్రీరామ ఫంక్షన్ హాల్లో శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నడిగూడెం ఎంపీపీ యాతకుల జ్యోతీమధుబాబు, తాసీల్దార్ పి.యాదగిరి, వెంపటి మధుసూదన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, సిరికొండ పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి వెంకట్రెడ్డి, ఏలూరి వెంకటేశ్వర్రావు, పాస్టర్లు శ్రవణ్కుమార్, యేసయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.
విద్యతోనే సామాజికాభివృద్ధి
అనంతగిరి : విద్యతోనే సామాజికాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని అమీనాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో చేపడుతున్న కళావేదికకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్తినేని కోటేశ్వర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రామినేని పూర్ణచందర్రావు, కళావేదిక దాతలు వెంకటేశ్వర్రావు, గురుస్వామి సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పుల్లారావు, విశ్వేశ్వర్రావు, వెంకటేశ్వర్రావు, అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నడిగూడెం : మండలంలోని సీఎస్ఐ చర్చిలో పేద క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మీమల్లేశ్యాదవ్, తాసీల్దార్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.