మేళ్లచెర్వు, డిసెంబర్ 16 : సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ జనిగ సైదులు ఆధ్వర్యంలో 200కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు సాగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అంతకు ముందు కార్యకర్తలు కోలాటాల నడుమ భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో చేరిక
హుజూర్నగర్ : గులాబీ జెండా అందరికీ అండ అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో గరిడేపల్లి మండలం మంగాపురానికి చెందిన 20కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో సర్పంచ్ మల్లీశ్వరి, ఉప సర్పంచ్ జగ్గు, గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లావుల నాగరాజు, ధరావత్ సక్య, వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు.