మోతె, డిసెంబర్ 12 : మండలంలోని విభళాపురం గ్రామ సమీపంలో నవంబర్ 26న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. మోతె మండలం అన్నారిగూడేనికి చెందిన నరేశ్(26) తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అదే గ్రామానికి చెందిన పడిశాల శంకర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో నరేశ్ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు శంకర్ తన స్నేహితుడైన ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన గుండెపంగు మధుసూదన్ గ్రామానికి పిలిపించుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి మునగాలలో ఆటో నడుపుతున్న నరేశ్ను పిలిపించుకున్నారు. ఫుట్గా మద్యం తాపించి ఆటోలోని తాడుతో నరేశ్ మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనుమానం రావొద్దని మృతుడిని ఆటోలో ఉంచి ఎస్సారెస్పీ కాల్వలో నెట్టివేసి ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించారు. అనంతరం విషయాన్ని అన్నారిగూడేనికి చెందిన దున్నపోతుల వెంకటేశ్వర్లుకు చెప్పి పిలిపించారు.
ఇద్దరు కలిసి మధుసూదన్ను రఘునాథపాలెంలో దించి వారు అన్నారిగూడేనికి వెళ్లారు. పడిశాల శంకర్ను హత్య చేసినందుకు మధుసూదన్కు రూ.30 వేలు ఇచ్చాడు. నరేశ్ను హత్య చేసిన శంకర్, గుండెపంగు మధుసూదన్ సహకరించిన దున్నపోతు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్ఐ ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.