తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రముఖ ఆలయాలుపునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారంఅర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామిఆలయాన్ని ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్తో కలిసి మంత్రి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ జ్ఞాపకార్థం కోటి నిర్మించనున్న ఆలయ రాజగోపురం మ్యాప్ను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే కిశోర్ రూ.20 లక్షలతో నిర్మించిన ధ్వజ స్తంభాన్ని తిలకించారు.
అర్వపల్లి, డిసెంబర్ 7 : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి తల్లి సావిత్రమ్మ జ్ఞాపకార్థం కోటి రూపాయల సొంత ఖర్చులతో నిర్మించనున్న రాజగోపురం మ్యాప్ను పరిశీలించారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ రూ.20లక్షలతో నిర్మించిన ధ్వజస్తంభాన్ని పరిశీలించారు. అంతకుముందు స్థానిక నాయకులు మంత్రి, ఎమ్మెల్యేలను శాలువా, పూలమాలలతో సత్కరించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటికం సత్తయ్యగౌడ్, నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, ఆలయ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచ్ బైరబోయిన సునీతారామలింగయ్య, ఎంపీటీసీలు కనుకు పద్మ, శ్రీనివాస్, బొడ్డు పద్మారామలింగం, తాసీల్దార్ యాదగిరిరెడ్డి, విద్యుత్ ఏఈ శ్రీకాంత్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.