నాంపల్లి, డిసెంబర్ 7 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, చండూరు, నారాయణపురం, మర్రిగూడెం మండలాలను కలుపుతూ రూ.95 కోట్లతో త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి సీడీపీఓ నిధులు రూ.10 లక్షల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో డొంక రోడ్ల మరమ్మతును చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు,సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, తాసీల్దార్ లాల్బహుదూర్, ఎంపీడీఓ శేషుకుమార్, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్రెడ్డి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులం, మతం అనే బేధం లేకుండా ప్రతి ఆడ బిడ్డపెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మొదటి సారిగా మండలానికి వచ్చిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, ఏడుదొడ్ల ప్రభాకర్రెడ్డి, పోగుల వెంకట్రెడ్డి, కడారి శ్రీశైలం, సపావత్ సర్దార్ నాయక్, మునగాల సుధాకర్రెడ్డి, ఎస్కే అబ్బాస్, కోరె యాదయ్య, బాషిపాక రాములు, కారింగు నర్సింహ, బల్గూరి విష్ణువర్ధన్, తుమ్మలపల్లి గోపాల్రెడ్డి, శ్రీలం జగన్మోహన్రెడ్డి, బోయపల్లి చంద్రయ్య, దండిగ నర్సింహ, గుండెబోయిన నారాయణ, కోలుకులపల్లి చెన్న య్య, రమావత్ రవి నాయక్, సైదులు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.