కనగల్, నవంబర్ 24 : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మైలసముద్రం, జి యడవెల్లిలోని ఉరదక్షిణ పాత చెరువులో గురువారం 11 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపపిల్లల ద్వారా గ్రామాల్లో అనేకమందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతకుముందు చెరువుల వద్ద ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, తాసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, మత్స్యశాఖ మండల చైర్మన్ బొమ్మరబోయిన భార్గవ్, ఆలయ కమిటీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఫిషరీస్ అధికారులు వెంకయ్య, శ్రీనివాస్, చింతరెడ్డి ప్రియాంకరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మారగోని గణేశ్, చింతల యాదగిరి, నక్క వెంకన్న, అంజ య్య, నక్క మోహన్, కృష్ణయ్య, శ్రీనివాస్, గోపాల్రెడ్డి, నగేశ్, శ్రీహరి పాల్గొన్నారు.
మైనార్టీలకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే : ఎమ్మెల్యే
నల్లగొండ రూరల్ : మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మైనార్టీ దినోత్సవం సందర్భంగా గురువారం మిర్యాలగూడ రోడ్డులోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, ఆర్సీఓ విష్ణు, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, పున్న గణేశ్, మారగోని భవాని, ఇబ్రహీం, బషీర్, సోహైల్, హాషం పాల్గొన్నారు.