తిరుమలగిరి (సాగర్), నవంబర్ 22 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని నేతాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బాసిరెడ్డి కుమారీవెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో ముగ్గురు వార్డు సభ్యులు, బీజేపీ గ్రామ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు చెందిన 50 కుటుంబాలు కూడా టీఆర్ఎస్లో చేరాయి. మండల కేంద్రంలో వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన వివిధ పార్టీల వారు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్య బాష్యానాయక్, వైస్ ఎంపీపీ దిలీప్రెడ్డి, సర్పంచ్ జయరాం, నాయకులు బిచ్చానాయక్, రాంసింగ్, జనార్దన్రెడ్డి, పెద్దిరాజు, రమణరాజు, చారి, మైనార్టీ నాయకులు నయీంపాషా, బుర్రి రాంరెడ్డి, నాగెండ్ల కృష్ణారెడ్డి, కోట్యానాయక్ పాల్గొన్నారు.