మునుగోడు, ఫిబ్రవరి 18 : తన నాయకత్వ పటిమతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ వైపు యావత్ దేశం ఆసక్తిగా చూస్తున్నదని మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మదర్ డెయిరీ పాల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాడి రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ఇన్ఫుట్ సబ్సిడీ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని అన్నారు.. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు ఏటా రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని అన్నారు. దళితబంధు వంటి గొప్ప పథకంపై దేశంలో ఏ ముఖ్యమంత్రికీ ఆలోచనే రాలేదని, దళితుల అభ్యున్నతిపై సీఎం కేసీఆర్ దార్శనికతకు దళిత బంధు పథకమే నిదర్శనమని పేర్కొన్నారు. పాడి రైతులు నాణ్యమైన పాలు తీసుకొచ్చి ప్రభుత్వం అందించే గరిష్ఠ ధర పొందాలని సూచించారు. అనంతరం గంగుల కృష్ణారెడ్డిని పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి, సర్పంచ్లు మిర్యాల వెంకన్న, గుర్రం సత్యం, ఎంపీటీసీ బొడ్డు శ్రావణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి సురేందర్రెడ్డి, ఎండీ అశోక్కుమార్, మార్కె టింగ్ డీజీఎం లింగారెడ్డి, ఏజీఎం జీవన్రెడ్డి, నాయకులు బొల్లం వెంకన్న, కందుల రాజుగౌడ్, కందుల లింగస్వామి, పూల వెంకన్న, పందుల నర్సింహ, దుకాణం యజమాని పందుల మల్లేశ్ పాల్గొన్నారు.