సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు మహాజన్తో పాటు 100 మంది సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలతోపాటు, ప్రజలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీలో
చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
అడ్డగూడూరు, నవంబర్ 21 : ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు మహాజన్తోపాటు 100మంది యువత మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సత్యంగౌడ్, నాయకులు అయోధ్య, జనార్దన్రెడ్డి, దేవగిరి పాల్గొన్నారు.