చిట్యాల, ఫిబ్రవరి 17 : తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం చిట్యాల శివారులోని గుత్తా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, వనమా వెంకటేశ్వర్లు, మెండే సైదులు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నాయకులు కర్నాటి, ఉప్పల వెంకట్రెడ్డి, వరకాంతం నరేందర్రెడ్డి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్, గుండెబోయిన సైదులు, రంగా వెంకటేశ్వర్లు, శివప్రసాద్, సిలువేరు శేఖర్ పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ : జడ్పీచైర్మన్ బండా నరేందర్రెడ్డి
నార్కట్పల్లి : తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు వద్ద మొక్కలు నాటారు. కేక్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, బండా అమృతారెడ్డి, యానాల అశోక్ రెడ్డి, చిరుమర్తి యాదయ్య, బత్తిని రమేశ్, సర్పంచులు యానాల మాధవి, గంట్ల నర్సిరెడ్డి, మహేశ్వరం సతీశ్, దుబ్బ మధు, కొత్త నర్సింహ, కర్న్ణాటి ఉపేందర్, మల్గ బాలకృష్ణ, దుబ్బాక శ్రీధర్, సిరిపంగి స్వామి, ఎంపీడీఓ యాదగిరి, ఏపీఓ యాదయ్య పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలోఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నీలగిరి : నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నల్లగొండ రాంనగర్లోని మున్సిపల్, రాజీవ్పార్కు ల్లో వెయ్యి మొక్కలను నాటారు. రామగిరి రామాలయం, తులసీనగర్ హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పూజలు చేసి ఆయుష్షు హోమం చేశారు. లతీఫ్ సాహెబ్ మెట్ల వద్ద ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. దేవరకొండ రోడ్డులోని పెద్ద చర్చి, విద్యుత్నగర్ చర్చి లో ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ప్రకాశంబజార్లోని పూల దుకాణాదారులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమన్నారు. అలాగే టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు మాలె శరణ్యారెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్ యామ కవితాదయాకర్, సీనియర్ నాయకులు చీర పంకజ్యాదవ్, మల్లేశ్గౌడ్, సత్తయ్యగౌడ్, నిరంజన్వలీ కౌన్సిలర్లు పర్వత్ ఫర్జానాఇబ్రహీం, అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఉట్కూరి వెంకట్రెడ్డి, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, బకరం వెంకన్న, మామిడి పద్మ, చకిలం వేణుగోపాల్రావు, నేలపట్ల రమేశ్, రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
తిప్పర్తి : మండల కేంద్రంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు ఇండ్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
జేపీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఇండ్లూరు, ఎర్రగడ్డలగూడెం, గోదావరిగూడెం మామిడాల గ్రామాల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. పజ్జూరులో అన్నదానం చేశారు. జేపీ కన్స్ట్రక్షన్ చైర్మన్ జీడిపల్లి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, వనపర్తి నాగేశ్వర్రావు, లొడంగి గోవర్ధన్, మార్త సైదులు, జాకటి మోష, మోయిజ్ ,రాగి మురళి పాల్గొన్నారు.
కనగల్ : దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. మండల కేంద్రంలో 500మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్రావు, వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
కారణ జన్ముడు కేసీఆర్ :మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
చండూరు : కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆయూష్షు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని హోమం చేసినట్లు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంతో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవీవెంకట్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ముడిగె ఎర్రయ్య యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, నాయకులు ఉజ్జిని అనిల్రావు, భూతరాజు దశరథ, పెండ్యాల గీత, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, చిలుకూరి రాధికాశ్రీనివాస్, కొన్రెడ్డి యాదయ్య,నందికొండ నర్సిరెడ్డి, మెండు వెంకట్రెడ్డి, బొడ్డు సతీశ్గౌడ్, కోడి గిరిబాబు, గుండమళ్ల శ్రీనివాస్, మొగుదాల వెంకన్న పాల్గొన్నారు.
మునుగోడు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ రోడ్డులోని పార్కులో ఎంపీపీ కర్నాటి స్వామి పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, పార్టీ ఉపాధ్యక్షుడు మందుల సత్యం, మాదగోని రుషికేశ్, మేకల భిక్షం, శరత్, బీసం నర్సింహ, ఏరుకొండ నాగరాజు, ప్రణయ్, రవి పాల్గొన్నారు.
మర్రిగూడలోటీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూర శంకర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు.
నాంపల్లి : మండలంలోని గౌరారం పరిధిలో గల చలిదోన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహరావు, మాల్ మార్కెట్ డైరెక్టర్లు కడారి శ్రీశైలం యాదవ్, మేకల దేవేందర్, దండిగ నర్సింహ, సపావత్ సర్దార్, బెక్కం రమేశ్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, బొట్టు జగన్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వీరేశం బైక్ ర్యాలీ..
కట్టంగూర్(నకిరేకల్) : నకిరేకల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వీముల వీరేశం బైక్ ర్యాలీ నిర్వహించి, కనకదుర్గమ్మ ఆలయంలో పూజ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పూజర్ల శంభయ్య, కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, గాదగోని కొండయ్య, మాజీ సర్పంచ్ గద్దపాటి దానయ్య పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి కేక్కట్ చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.
కట్టంగూర్ : కట్టంగూర్లో సాయిమణికంఠ ఆలయంలో జడ్పీటీసీ తరాల బలరాములు పూజలు నిర్వహించి కేక్కట్ చేసి గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచులు, ఎంపీటీసీలు పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, పరశురాములు, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని గ్రామాల్లో మొక్కలు నాటి కేక్ను కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిముట వెంకన్నయాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, సర్పంచులు బచ్చు జానకీరాములు, కట్టా శ్రవణ్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డి.సునీత, మాజీ ఎంపీపీ గుత్తా మంజులామాధవరెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సబ్ స్టేషన్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, వైస్ ఎంపీపీ కందుల అనిత, నాయకులు కట్టా వెంకట్రెడ్డి, చాడ హతీశ్రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, గంట శంకర్ పాల్గొన్నారు.