రామగిరి, ఫిబ్రవరి 13: కార్పొరేట్ పాఠశాల కంటే అదనపు అడ్మిషన్లు.. అదే స్థాయిలో ఉత్తీర్ణత.. పదేళ్లుగా ఆంగ్ల బోధనతో ఉత్తమ ఫలితాలు.. వెరసి కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ రాష్ట్రంలోనే తనదైన గుర్తింపును చాటుతున్నది. 1,475అడ్మిషన్లతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కల ఐదు మండలాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తుండగా తరగతి గదులను 27సెక్షన్లుగా విభజించారు. అంకిత భావం కలిగిన 44 మంది టీచర్లు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ప్రొజెక్టర్తో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడలు, యోగా, వ్యాయామం నేర్పిస్తున్నారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి అధ్యాపక బృందం విశేషంగా కృషి చేస్తున్నది.కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ ఆవరణంతా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నది. వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదువులో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల్లో సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేలా సైబర్ కాంగ్రెస్, షీ టీం, ఎస్పీసీ(పోలీస్ స్టూడింట్ కమిటీ)ను నియమిస్తున్నారు. పాలిసెట్, గురుకుల, టీఎస్ఆర్జేసీ సహా పలు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
పాఠశాల విశేషాలు..
పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎం, 43 మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో 19మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నవారే కావడం విశేషం. మరో ఆరుగురు నాన్టీచింగ్ స్టాఫ్, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఇద్దరు పార్ట్టైం ఇన్స్టక్టర్స్ పనిచేస్తున్నారు.
2018-19లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం…
సిద్దిపేటలో నిర్వహించిన ఇన్స్పైర్మానక్ అవార్డుల ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 45మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్, నెల్లి ఫౌండేషన్ స్కాలర్షిప్ అందుకున్నారు.
అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులంతా బృందాలుగా ఏర్పడి కొండమల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తారు. పాఠశాల అభివృద్ధి, ప్రత్యేకతలు, విద్యా బోధనపై ముద్రించిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు.
విద్యార్థుల అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు..
8 రోజూ ప్రార్థన సమయంలో ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత, ప్రముఖుల జయంతి, వర్ధంతిపై మాట-ముచ్చట నిర్వహిస్తారు.
8 విద్యతోపాటు వర్క్ఎడ్యుకేషన్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభూతితో నేర్చుకునేలా
డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు.
దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి…
కొండమల్లేపల్లి పాఠశాల అభివృద్ధిలో దాత సహకారం ఎంతో ఉంది. 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి ఆర్థిక సాయంతో పలు వసతులు కల్పించారు. 350 డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫర్నిచర్, విద్యుదీకరణ, టేబుళ్లు, కుర్చీలు, మైక్సెట్తో పాటు పాఠశాలకు రంగులు వేయించారు. ఇలా ఎంతో మంది పాఠశాల అభివృద్ధికి దోహదపడుతున్నారు.
మీడియం, తరగతి వారీగా విద్యార్థులు..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొత్తం 1,475మంది(తెలుగు మీడియం 265, ఇంగ్లిష్ మీడియం 1210మంది) విద్యార్థులున్నారు. వీరిలో 863మంది బాలురు, 612మంది బాలికలున్నారు. కేవలం పదో తరగతిలోనే 306(192 మంది బాలురు, 114 బాలికలు) మంది విద్యార్థులు ఉన్నారు.
‘మన ఊరు-మనబడి’లో అందుబాటులోకి వచ్చేవి ఇవే…
ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా గదుల నిర్మాణం.
విద్యార్థుల సంఖ్యకు అవసరమైన మరుగుదొడ్లు, తాగు నీరు, క్రీడాసామగ్రి, ఆడిటోరియం, అదనపు డిజిటల్ తరగతి గదులు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న 7 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం..
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ఉపాధ్యాయులంతా సమష్టిగా శ్రమిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధిస్తుండడం మా పాఠశాల ప్రత్యేకత. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా బోధన కొనసాగుతుండడంతోనే 1,210మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. దాదాపు అందరూ పేద విద్యార్థులే. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్స్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి. సీఎం కేసీఆర్ సార్ మన ఊరు.. మన బడి కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం.
– మంద సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు ,కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్
కార్పొరేట్ పాఠశాల కంటే అదనపు అడ్మిషన్లు.. అదే స్థాయిలో ఉత్తీర్ణత.. పదేళ్లుగా ఆంగ్ల బోధనతో ఉత్తమ ఫలితాలు.. వెరసి కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ రాష్ట్రంలోనే తనదైన గుర్తింపును చాటుతున్నది. 1,475అడ్మిషన్లతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కల ఐదు మండలాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తుండగా తరగతి గదులను 27 సెక్షన్లుగా విభజించారు. అంకిత భావం కలిగిన 44 మంది టీచర్లు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ప్రొజెక్టర్తో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రీడలు, యోగా, వ్యాయామం నేర్పిస్తున్నారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి అధ్యాపక బృందం విశేషంగా కృషి చేస్తున్నది.
విద్యార్థుల అడ్మిషన్లలో రాష్ట్రంలోనే రెండో స్థానం..
1,475మంది విద్యార్థులు.. బాలురు 863, బాలికలు 612..
తెలుగు మీడియంలో 265, ఆంగ్లంలో 1,210మంది..
పదేండ్లుగా ఆంగ్ల మాధ్యమం, అద్భుతమైన ఫలితాలు
కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ ఆవరణంతా సీసీ కెమెరాల నిఘాలో ఉన్నది. వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదువులో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల్లో సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేలా సైబర్ కాంగ్రెస్, షీ టీం, ఎస్పీసీ(పోలీస్ స్టూడింట్ కమిటీ)ను నియమిస్తున్నారు. పాలిసెట్, గురుకుల, టీఎస్ఆర్జేసీ సహా పలు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
పాఠశాల విశేషాలు..
పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎం, 43 మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో 19మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నవారే కావడం విశేషం. మరో ఆరుగురు నాన్టీచింగ్ స్టాఫ్, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఇద్దరు పార్ట్టైం ఇన్స్టక్టర్స్ పనిచేస్తున్నారు.
2018-19లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం…
సిద్దిపేటలో నిర్వహించిన ఇన్స్పైర్మానక్ అవార్డుల ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 45మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్, నెల్లి ఫౌండేషన్ స్కాలర్షిప్ అందుకున్నారు.
అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులంతా బృందాలుగా ఏర్పడి కొండమల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి మండలాల్లోని గ్రామాల్లో పర్యటిస్తారు. పాఠశాల అభివృద్ధి, ప్రత్యేకతలు, విద్యా బోధనపై ముద్రించిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు.
విద్యార్థుల అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు..
రోజూ ప్రార్థన సమయంలో ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత, ప్రముఖుల
జయంతి, వర్ధంతిపై మాట-ముచ్చట నిర్వహిస్తారు.
విద్యతోపాటు వర్క్ఎడ్యుకేషన్, ఆర్ట్స్ ఎడ్యుకేషన్స్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభూతితో నేర్చుకునేలా
డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు.
దాతల సహకారంతో పాఠశాలల అభివృద్ధి…
కొండమల్లేపల్లి పాఠశాల అభివృద్ధిలో దాత సహకారం ఎంతో ఉంది. 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి ఆర్థిక సాయంతో పలు వసతులు కల్పించారు. 350 డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫర్నిచర్, విద్యుదీకరణ, టేబుళ్లు, కుర్చీలు, మైక్సెట్తో పాటు పాఠశాలకు రంగులు వేయించారు. ఇలా ఎంతో మంది పాఠశాల అభివృద్ధికి దోహదపడుతున్నారు.
మీడియం, తరగతి వారీగా విద్యార్థులు..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొత్తం 1,475మంది(తెలుగు మీడియం 265, ఇంగ్లిష్ మీడియం 1210మంది) విద్యార్థులున్నారు. వీరిలో 863మంది బాలురు, 612మంది బాలికలున్నారు. కేవలం పదో తరగతిలోనే 306(192 మంది బాలురు, 114 బాలికలు) మంది విద్యార్థులు ఉన్నారు.
‘మన ఊరు-మనబడి’లో అందుబాటులోకి వచ్చేవి ఇవే…
ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా గదుల నిర్మాణం.
విద్యార్థుల సంఖ్యకు అవసరమైన మరుగుదొడ్లు, తాగు నీరు, క్రీడాసామగ్రి, ఆడిటోరియం, అదనపు డిజిటల్ తరగతి గదులు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న 7 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం..
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ఉపాధ్యాయులంతా సమష్టిగా శ్రమిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బోధిస్తుండడం మా పాఠశాల ప్రత్యేకత. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా బోధన కొనసాగుతుండడంతోనే 1,210మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. దాదాపు అందరూ పేద విద్యార్థులే. పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తాగునీరు, టాయిలెట్స్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి. సీఎం కేసీఆర్ సార్ మన ఊరు.. మన బడి కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లో ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం.
– మంద సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు
ప్రైవేట్ కంటే సర్కార్ బడిలోనే బాగా చెప్తున్నరు..
ప్రైవేట్ స్కూల్లోనే చదువు బాగా చెప్తారనేది అపోహ మాత్రమే. మా పాఠశాలలో పాఠాలు అర్థమయ్యేలా సులభ పద్ధతుల్లో బోధిస్తారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగానే యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ప్రైవేట్ స్కూల్లో ఇవేమీ ఇవ్వరు. పైగా అన్నింటికీ డబ్బులు బాగా వసూలు చేస్తరు. ప్రైవేట్ స్కూల్స్లో కో కరిక్యులమ్ యాక్టివిటీస్ ఉండవు. కానీ మా బడిలో ప్రైవేట్ కంటే అన్ని మౌలిక సదుపాయాలతో స్టడీ ఉంది. శాఖాజీపురం నుంచి నాతోపాటు మరో 25మంది ఇదే స్కూల్కు వస్తున్నాం.
– పి.స్వాతి, పదో తరగతి విద్యార్థిని