యాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 9 : మండలంలోని బాహుపేట గ్రామ రైల్వే పట్టాలపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత గణేశ్(25), సునంద(23) ఇద్దరు కొనేండ్ల క్రితం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో నలందకు ఆమె కుటుంబ సభ్యులు రెండేండ్ల క్రితం యాదగిరిగుట్టకు చెందిన యాదగిరితో వివాహం జరిపించారు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున గణేశ్, నలంద బైక్పై బాహుపేట వద్ద నున్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కాగా,నలంద భర్త ఉద్యోగానికి వెళ్లి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టు పక్కల వెతికాడు. ఆచూకీ తెలియకపోవడంతో నలంద అన్న సాయిబాబాకు సమాచారం అందించాడు. వీరిద్దరూ కలిసి పలు చోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో బుధవారం వేకువజామున యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పోలీసులకు రైల్వే ట్రాక్ వద్ద రెండు మృతదేహాలు పడి ఉన్నట్లు సమాచారం అందించడంతో పరిశీలించి వీరిని బస్వాపురం గ్రామానికి చెందిన గణేశ్, నలందగా గుర్తించారు.