శాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు n స్వామి వారి ఖజానాకు రూ.27,49,874 ఆదాయం
యాదాద్రి, నవంబర్ 4 : కార్తిక మాసం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో శుక్రవారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం లక్ష పుష్పార్చన పూజలు సుమారు 2గంటల పాటు నిర్వహించారు.
శాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు
లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాయాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన
శాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు n స్వామి వారి ఖజానాకు రూ.27,49,874 ఆదాయంకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య
తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వీక్షించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తిక మాసం సందర్భంగా కొండ కింద వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 685మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు.
పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి అర్చకులు, పురోహితులు కార్తిక మాసం సందర్భంగా అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 24వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 27,49,874 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
వ్రత మండపం వద్ద జలప్రసాదం
యాదాద్రి కొండ కింద సత్యనారాయణ వ్రత మండపం వద్ద ఆలయ అధికారులు తాగునీటి వసతి కల్పించారు. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెట్ ఆధ్వర్యంలో యాదాద్రి జల ప్రసాదం పేరుతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ఫ్లాంట్ను ఆలయాధికారులు శుక్రవారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరసర ప్రాంతాల్లో మొత్తం 17ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ విద్యుత్ విభాగం ఈఈ ఊడేపు రామారావు, దివీస్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.