సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో రైతులు వరి పంటను అత్యధికంగా వేశారు. ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలస్యంగా వేసిన మరికొన్ని ప్రాంతాల్లో పంటలు కోత దశకు వచ్చాయి. అయితే.. పంట కోత సమయంలో, అనంతరం చిన్న చిన్న మెళకువలు పాటిస్తే నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేరేడుచర్ల ఇన్చార్జి వ్యవసాయాధికారి ప్రీతమ్కుమార్ వివరించారు.
– నేరేడుచర్ల, నవంబర్ 4