నాంపల్లి, అక్టోబర్ 27: మండలంలోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన ప్రజలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీశ్రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములను కోల్పోయిన వారి త్యాగాలను ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. ఫ్లోరిన్ ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీరు అందించడానికి భారీ ప్రాజెక్టులు నిర్మించడంలో భాగంగా భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతాంగానికి, సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. పేదింటి కులం, మతం అనే తేడా లేకుండా సీఎం కేసీఆర్ తెలంగాణలో జరిగే ప్రతి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సాయం అందిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి గుజరాతీలకు గులామ్గా మారాడన్నారు.
ఆయనకు బుద్ధి రావాలంటే మునుగోడులో సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీ బెక్కం రమేశ్, పచ్చిపాల రామకృష్ణ, గడ్డి అంజయ్య, గడ్డి మల్లయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.