చిట్యాల, అక్టోబర్ 4 : భారత జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తే యావత్ దేశాన్ని అవమానించినట్లేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కోల్కతాలో దుర్గామాత మండపంలో మహిషాసురుడి స్థానంలో గాంధీని పోలిని బొమ్మను పెట్టి అవమానించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం చిట్యాలలోని గాంధీగుడిలో పూజలు చేసి మహాత్ముడి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాడ్సే శిష్యులే ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ, మతతత్వ పార్టీలు, వారి అనుబంధ సం ఘాలు వారికి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. విశ్వ గురువుగా పేరు గాంచిన గాంధీని ఇంత ఘోరంగా అవమానించడం హేయమన్నారు. గాంధీజీని అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెగట్టె మల్లికార్జున్రెడ్డి, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, సిలువేరు ప్రభాకర్, నాయకులు బొందయ్య, లక్ష్మయ్య, చంద్రకాంత్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, చంద్రకళ, గీత, విమల, రాధ పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు : మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి మంగళవారం క్షీరాభిషేకం నిర్వహించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు ఇరుకుల్ల వెంకన్న, పట్టణాధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య, గౌరవాధక్షుడు సోమ వెంకటేశ్వర్లు, ప్రతినిధులు బుక్క విశ్వనాథం, వెంకటయ్య, ప్రవీణ్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్లో..
భువనగిరి అర్బన్ : పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంగళవారం పలువురు నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెన్న మహేశ్, 17వ వార్డు అధ్యక్షుడు గాదె శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు రమేశ్, నాయకులు శ్రవణ్, నాగరాజు, శేఖర్, మురళి, సందీప్ ఉన్నారు.
సూర్యాపేటలో..
బొడ్రాయిబజార్ : పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మంగళవారం పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు క్షీరాభిషేకం చేసి హిందూ మహాసభ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధానకార్యదర్శి బండారు రాజా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు వెంపటి సురేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఉప్పల ఆనంద్, వాసవీ భవన్ జిల్లా అధ్యక్షుడు తోట శ్యాంప్రసాద్, ఆర్. శ్రీనివాస్, సత్యనారాయణ, వంశీ, లక్ష్మయ్య, కృష్ణ, పాండు, వంశీ, అనిత, కమల, శ్యాంసుందర్, రాము, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి : నార్కట్పల్లి మహాత్మాగాంధీని అవమానించడాన్ని నిరసస్తూ ఆయన చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాల్వాయి భాస్కర్రావు, రంగ య్య, భిక్షమయ్య, వాసుదేవ్, విష్ణుమూర్తి, జనార్దన్, కిషన్, రవీందర్, శ్రీనివాస్, కృష్ణయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్, చంద్ర శేఖర్, సంతోష్, సంపత్ పాల్గొన్నారు.
తుంగతుర్తిలో…
తుంగతుర్తి : మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తిలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం రాజకీయ చైర్మన్ తాటికొండ సీతయ్య, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి సత్యనారాయణ, దయాకర్, శ్రీను, శ్రీను, ఎల్లయ్య, వెంకటేశ్వర్లు, రమేశ్గౌడ్, రాములు, వెంకన్న పాల్గొన్నారు.
మహాత్ముడిని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి
రామగిరి, అక్టోబర్ 4 : దేశానికి అహింస మార్గంలో స్వాతంత్య్రం తీసుకవచ్చిన మహాత్మాగాంధీని అవమాన పర్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానిండచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఆయన గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. ప్రపంచం పూజించే గాంధీనీ అవమానించడం సిగ్గు చేటన్నారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాంధీని అవమానించిన వ్యక్తులు, హిందూ మహాసభ ప్రతినిధులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధానకార్యదర్శి యమా దయాకర్, కౌన్సిలర్ యామ కవితాదయాకర్, సీనియర్ నాయకుడు కోటగిరి దైవాదీనం, వాసవీక్లబ్ గవర్నర్ రామకృష్ణ, సతీశ్, శేఖర్, వెంకయ్య, గట్టు వెంకన్న, జగిని వెంకన్న, గిరీశ్కుమార్, శేఖర్, భాగ్య, సమంత, పద్మావతి, రాణి పాల్గొన్నారు.