కేతేపల్లి, సెప్టెంబర్ 30 : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బండపాలెంలో గ్రామపంచాయతీ భవనం శిలాఫలకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, రైతులకు ఉచి త విద్యుత్, పింఛన్లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు సీఎం కేసీ ఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.సీఎం కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెడుతుండడంతో ప్రధానికి వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ : మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, మహిళలకు బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో తాసీల్దార్ డి.వెంకటేశ్వర్లు సర్పంచ్, ఎంపీటీసీ వి.జయమ్మ, ఎ.సంధ్య, సర్పంచులు బి.శ్రీనివాస్యాదవ్, బచ్చు జానకీరాములు, కోట వెంకటేశ్వర్రావు, కట్టా శ్రవణ్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, వెంకన్నయాదవ్, నాయకులు చల్ల కృష్ణారెడ్డి,జి.వేణుమాధవరెడ్డి, కె.యాదగిరిగౌడ్, కె.సైదులు గౌడ్ పాల్గొన్నారు.
మన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం
తిప్పర్తి : రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలు స్తున్నాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.మండలంలోనిజొన్నగడ్డలగూడెం, రాజుపేట, మామిడాల, సిలారిమియాగూడెం, సర్వారం, ఆరెగూడెం, గోదవారిగూడెం గ్రామాల్లో శుక్రవారం ఆయన బతుకమ్మ చీరెలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పింఛన్ కార్డులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఇతర రాష్ర్టాల నాయకులు, ప్రజలు కేసీఆర్ లాంటి పాల న కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్రెడ్డి, సర్పంచులు బత్తిని పురుషోత్తం, వెంకట్రాంరెడ్డి, ప్రవీణ్, యర్రమాద కవిత, ఎంపీటీసీలు బత్తిని మట్టయ్య, సందీప్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, వనపర్తి నాగేశ్వర్రావు, జ్యోతి పాల్గొన్నారు.
నకిరేకల్లో..
నకిరేకల్: మండలంలోని కడపర్తి గ్రామం లో బతుకమ్మ చీరెలు, పింఛన్ కార్డులు వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొప్పు సోమయ్య, పంచాయతీ కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు.
కట్టంగూర్: మండల కేంద్రంలో రేషన్ దుకాణాల వద్ద ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రెడ్డిపల్లి మనోహర్ టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొల్లెద్దు యాద య్య, పట్టణాధ్యక్షుడు శ్రీపాద రామకృష్ణచారి, నాయకులు అయితగోపి సైదులు, యర్కల శ్రీను, జిల్లా యాదయ్య, సైదు లు, గోగు బాల సైదులు పాల్గొన్నారు.
శాలిగౌరారంలో..
శాలిగౌరారం:మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరె లను సర్పంచ్ బట్ట హరితావీరబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జోగు సైదమ్మ, గుజిలాల్ శేఖర్బాబు, ఉప సర్పంచ్ సురేశ్రెడ్డి, శ్రీనివాస్, శ్రీరామదాసు రాజు లింగయ్య పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు: చీకటిమామిడి, కొంపల్లి, వెల్మకన్నె, కల్వకుంట్ల గ్రామాల్లో బతుకమ్మ చీరెలను ఎంపీపీ కర్నాటి స్వామి పంపిణీ చేశారు. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, చండూరుమార్కెట్ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాసు, శరత్బాబు పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి :టీఆర్ఎస్ సర్కారుతోనే పేదలకు న్యాయం జరుగుతుందని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని తిరుమలగిరి గ్రామంలో బతుకమ్మ చీరెలు, పింఛన్ కార్డులు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బోడ ఎల్లమ్మాశ్రీను, ఉప సర్పంచ్ చెన్నబోయిన నగేశ్, యాదయ్య పాల్గొన్నారు.
మర్రిగూడలో..
మర్రిగూడ : మండలంలోని తమ్మడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొట్టం మాధవీరమేశ్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శిరీష, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు కనగల్ మండలంలో ..
కనగల్ : మండలంలోని గ్రామాల్లో ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్రెడ్డి శనివారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాద య్య గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.