నేరేడుగొమ్ము (చందంపేట), సెప్టెంబర్ 30 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ కృష్ణా వెనుక జలాల్లో ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలి మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కోటి చేప పిల్లలను వదులుతున్నట్లు పేర్కొన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా వైజాగ్ కాలనీ పాఠశాలలో రూ. 40.11 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర ప్రభు త్వం చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాహన్మానాయక్, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మి, జడ్పీటీసీ కేతావత్ బాలు, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతయ్య, రైతు బంధు మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సీఐ పరశురాం, గోపాల్రెడ్డి, సర్పంచ్ బావోజీ, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మారాములు, కోఆప్షన్ సభ్యుడు పాషా, బిక్కు, వెంకటయ్య, బాలు, కొండల్రెడ్డి, బషీర్, నరేశ్ పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ఏర్పాటుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని కాచరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు.
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత
దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యా త్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, యుగేంధర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, శ్రీనివాస్యాదవ్, ఉపసర్పంచ్ సురేశ్, శ్రీను పాల్గొన్నారు.