చండూరు(గట్టుప్పల్)/నాంపల్లి/మర్రిగూడ, సెప్టెంబర్ 30 : గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్, నాంపల్లి మండలం మహ్మదాపురం కాంగ్రెస్ ఎంపీటీసీ మలిగిరెడ్డి శ్రీదేవి, మాజీ సర్పంచ్ తుమ్మలూరి దయాకర్రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో శుక్రవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా మర్రిగూడ మండలం నుంచి బీజేపీ మండలాధ్యక్షుడు చెర్కు శ్రీరాంగౌడ్, ప్రధాన కార్యదర్శి, సరంపేట ఉప సర్పంచ్ జెల్లాకుల సైదులుయాదవ్, సరంపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మోటం మల్లయ్య, ఉగ్గం రామస్వామి, వట్టిపల్లి వార్డు సభ్యుడు ఉప్పు యాదయ్య, మాజీ సర్పంచ్ ఉప్పు బుచ్చప్ప సహా 30 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ మర్రిగూడ ఇన్చార్జి, చందంపేట మాజీ ఎంపీపీ గోవింద్యాదవ్, సర్పంచ్ వెనమల్ల వెంకటమ్మామధుకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని మొదటి స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్పై పెరిగిన విశ్వసనీయతకు ఈ చేరికలు నిదర్శమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల ప్రవాహం కొనసాగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న ప్రగతిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు సంతోషంగా లేరన్నారు. యావత్ భారత ప్రజలు చిన్న రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నారని వెల్లడించారు. దేశాన్ని సంక్షేమంగా మార్చడమే కేసీఆర్ లక్ష్యమని, అందుకే జాతీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గట్టుప్పల్ ఇన్చార్జి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్నారాయణగౌడ్, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్, ఉపాధ్యక్షుడు పి.పాండుగౌడ్, టీఆర్ఎస్ వట్టిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కొంపెల్లి నాగరాజు గౌడ్, నాయకులు బండారు చంద్రయ్య, భీమగాని మహేశ్గౌడ్, అవ్వారు శ్రీనివాస్, నామని గోపాల్, బొడిగె వెంకటేశ్, నక్క చంద్రశేఖర్, గజ్జల గెల్వాల్రెడ్డి, గంట కృష్ణసాగర్, వెనమల్ల నర్సింహ, సంగెపు గిరి, రావుల గిరిగౌడ్, సుంకరి మల్లేశ్, నర్సింహ యాదవ్, దాసరి భిక్షం, నక్కనగోని శేఖర్ పాల్గొన్నారు.
కుంట్లగూడేనికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు..
స్థానిక మార్కెట్ యార్డులో మండలంలోని కుంట్లగూడేనికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నమ్మిన ప్రజలను నట్టేట ముంచి తన కాంట్రాక్టుల కోసం రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడున్నరేండ్లయినా నియోజకవర్గంలో మూడు పనులు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పట్టని ఆయన కేవలం కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవిని వాడుకున్నాడని అన్నారు. ఉప ఎన్నికలో ఆయనకు డిపాజిట్ రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రెట్టింపు అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ ప్రధాన కార్యదర్శి దోర్నాల అంజయ్య, నాయకులు బాల విఠల్, దోర్నాల రామస్వామి, బాల భద్రయ్య, కర్నాటి కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, సర్పంచ్ మిర్యాల పారిజాతాగోపాల్, గ్రామశాఖ అధ్యక్షుడు పర్సగోని పాండు, ప్రధాన కార్యదర్శి వల్లకాటి అనిల్కుమార్, లక్ష్మయ్య, శేఖర్, లింగస్వామి, స్వామి, జగన్, రమేశ్ పాల్గొన్నారు.