ఆలేరు, సెప్టెంబర్ 24 : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆలేరులోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో 72 మంది ఆర్జీలు పెట్టుకోగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, నాయకులు ఆడెపు బాలస్వామి, కుండె సంపత్, పయాజ్, రామకృష్ణ, పంతం కృష్ణ పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని కుర్రారం ఊర చెరువు గండికి మరమ్మతులు చేయాలని గ్రామ సర్పంచ్ జూకంటి మమతాబాలస్వామి ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేకులపల్లి మల్లారెడ్డి, వార్డు సభ్యులు ఎర్రగుంట సునీల్, ఊట్కూరి నర్సమ్మ పాల్గొన్నారు.