మునుగోడు, సెప్టెంబర్ 20 : గౌడ కులస్తుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభు త్వం పెద్దపీట వేసిందని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నా రు. మండల కేంద్రంలో బూర నర్సయ్యగౌడ్ సొంత నిధులతో నిర్మించిన గౌడ కులస్తుల భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి తాటి విత్తనాలను నాటి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తాటిచెట్లపై పన్నును రద్దు చేసి, 50 ఏండ్లునిండిన గీత కార్మికులకు నెలకు రూ.2,016 పింఛన్ అందజేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, ఎంపీటీసీ బొడ్డు శ్రావణి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, వైస్ ఎంపీపీలు పానగంటి వెంకన్న, మార్కెట్ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య, అనంత వీణ, బొడ్డు నాగరాజుగౌడ్, పోలగోని సైదులు, పాలకూరి యాదయ్య, అనంత లింగస్వామి పాల్గొన్నారు.
బిహార్ తాటి పొట్టి విత్తనాల పంపిణీ
మర్రిగూడ : బీఎల్ఆర్ ఫౌండేషన్, నంద సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని యరగండ్లపల్లి, మర్రిగూడ గ్రామాల్లో మంగళవారం బిహార్ తాటి పొట్టి విత్తనాలను మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ నాటారు. అనంతరం గీత కార్మికులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 80 అడుగుల వరకు ఉన్న తాటిచెట్లను ఎక్కి కల్లు గీసే క్రమంలో అనేక మంది కార్మికులు చనిపోయారన్నారు. బిహార్ తాటిచెట్లు 20 అడుగుల వరకు మాత్రమే ఎదుగుతాయన్నారు.ఈ చెట్లకు నిచ్చెన సాయ ంతో కల్లును గీయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, సర్పంచ్ నల్ల యాదయ్య, ఎంపీటీసీ కట్కూరి వెంకటేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ పందుల యాదయ్య, నాయకులు పందుల రాములు గౌడ్, చెర్కు లింగంగౌడ్, ముద్దం శ్రీనివాస్గౌడ్, ముత్యాలు పాల్గొన్నారు.
చండూరు : మండలంలోని అంగడిపేట వాగులో బిహార్ పొట్టి తాటి విత్తనాలను మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం నాటారు. కార్యక్రమంలో వడ్డెపల్లి గోపాల్ గౌడ్, భీమనపల్లి శేఖర్, బోయపల్లి శేఖర్, మోగుదాల దశరథ, కిరణ్, సత్యనారాయణ, యాదయ్య ఉన్నారు.