నల్లగొండ, ఫిబ్రవరి 4: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. రూ. 4.24 కోట్ల విలువైన చెక్కులను నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి భారం కావద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ మేనమామలా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.1,01,116 ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గర్భిణులకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందజేయడంతో పాటు డెలివరీ సమయంలో ప్రతి తల్లికీ రూ.13 వేలతో పాటు 16 రకాల వస్తువులతో కిట్ను ప్రభుత్వం అందిస్తున్నట్లు చెపారు. నల్లగొండ పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అందులో భాగంగానే కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లోనే పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీకరించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ కరీం పాష, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, సింగం రామ్మోహన్, లక్ష్మి, పల్రెడ్డి రవీందర్రెడ్డి, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, జమాల్ ఖాద్రి, పిన్నపురెడ్డి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.