నల్లగొండ రూరల్ : గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులు అన్నారు. రిజర్వేషన్ల పెంపును హర్షిస్తూ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు ప్రదీప్నాయక్, ప్రవీణ్నాయక్, లచ్చూనాయక్, నాగార్జుననాయక్, ఎరుకల సంఘం నాయకులు రుద్రాక్షి నరసింహ, వెలుగు శంకర్, రుద్రాక్షి వెంకన్న, కొండల్, యాదగిరి, సుజాత, లింగమ్మ, అశోక్, సురేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి సాగర్ : గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్ అని గిరిజన నాయకులు అన్నారు. మండలంలోని జువ్విచెట్టుతండాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సంక్షేమ ఫలాలు అందించడంలో కేసీఆర్కు సాటిరారని కొనియాడారు.
మర్రిగూడ : గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడమే కాకుండా గిరిజన బంధు పథకాన్ని కూడా అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి గిరిజనులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గిరిజనుల సంక్షేమాన్ని కోరుకునే టీఆర్ఎస్ వెంటే గిరిజనులంతా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్, సహకార చైర్మన్లు పందుల యాదయ్యగౌడ్, బాలం నర్సింహ, సర్పంచులు నల్ల యాదయ్య, నున్సావత్ సక్కుబాయిబిచ్చు, కుంభం మాధవరెడ్డి, ఆంబోతు సుధాకర్నాయక్, ఎంపీటీసీలు శిలువేరు విష్ణు, నేనావత్ బంతిలాల్, నాయకులు ఐతగోని వెంకటయ్యగౌడ్, రామన్న, లింగంగౌడ్, శ్రీరాములు, రాములుగౌడ్, లాలునాయక్, యాదగిరి, నున్సావత్ గోపీనాయక్, రమావత్ నరేశ్నాయక్, ఆంగోత్ విజయ్నాయక్, పాండుగౌడ్, కారింగు నర్సింహ పాల్గొన్నారు.
తుంగతుర్తి : రిజర్వేషన్ల పెంపు హామీని హర్షిస్తూ మండలంలోని దేవునిగుట్టతండా, రావులపల్లి ఎక్స్రోడ్తండా, మానాపురం, సూర్యతండా, మంచితండాతో పాటు మండల కేంద్రంలో గిరిజన నాయకులు సర్పంచుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గిరిజన సర్పంచులు యాకూనాయక్, వీరూజీ, వెంకన్ననాయక్, కాంతమ్మ, రామ్నాయక్, పద్మ, శంకర్నాయక్, శారద, నీలమ్మ, భాస్కర్, మోహన్లాల్, మహిళలు పాల్గొన్నారు.