యాదాద్రి, సెప్టెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. మొదటగా శ్రీసుదర్శన నా రసింహ హోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వార్లను కొలుస్తూ హోమం జరి పారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి వెలుపలి ప్రాకార మండపంలో తిరు కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణో త్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారి సహస్రనామార్చన చేపట్టారు. అలాగే పా తగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల వైభవంగా నిర్వహించారు.
స్పటికలింగేశ్వరుడికి రుద్రాభిషేకం
పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటికలింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. సుమారు 12,822 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని శ్రీస్వామివారి ఖజానాకు రూ. 16,83,318 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం..
లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో నిర్వహించే నిత్యాన్నదానం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. హైదరాబాద్కు చెందిన భక్తుడు ఉపేందర్ సోమవారం రూ. 1,01,116 విరాళం ప్రకటించారు. ఇందుకు సం బంధించిన చెక్కును కుటుంబసభ్యులతో కలిసి సోమవారం యాదాద్రి ఆలయంలో ఆలయ ఏఈఓ గజవెల్లి రఘుకు అందజేశారు.