శాలిగౌరారం, సెప్టెంబర్ 19: సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని బైరవునిబండ, ఊట్కూర్ గ్రామాల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణలో అందుతున్న సంక్షేమ పథకాలను అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ర్టాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారని అన్నారు. అనంతరం గ్రామ ంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ రణీల, వైస్ ఎంపీపీ గంట కందుల అనిత, సర్పంచులు వేముల లింగయ్య, దండ రేణుక, ఎంపీటీసీ కొత్త శంకర్రెడ్డి, యరాల లింగారెడ్డి ,పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, గుండా శ్రీనివాస్, చాడ హతీశ్రెడ్డి, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వ య్య, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, గంట శంకర్, శానాల యుగేంధర్రెడ్డి, దాసరి వెంకన్న పాల్గొన్నారు.
వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిక
మండలంలోని బైరవునిబండ, వల్లాల, ఊట్కూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు వంద మంది ఎమ్మెల్యే కిశోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, గ్రామ శాఖల అధ్యక్షుడు కొన్రెడ్డి వేణుగోపాల్రెడ్డి,ఈదులకంటి యాదయ్య, రావుల రామచంద్రు పాల్గొన్నారు.