దేవరకొండ, ఫిబ్రవరి 4 : కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కోర్టు అదనపు భవనంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. లాయర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, బార్ అసోసియేషన్ నాయకులు గాజుల ఆంజనేయులు, గౌరి శంకర్, రాములు, ఉమా మహేశ్, వనం జగదీశ్వర్, వనం శ్రీను, రాజశేఖర్ పాల్గొన్నారు.
విజయేందర్రెడ్డి సేవలు అభినందనీయం
దేవరకొండరూరల్ : దేవరకొండ డివిజన్ సహాయ సంచాలకులుగా టి.విజయేందర్రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. బదిలీపై వెళ్తున్న విజయేందర్రెడ్డికి శుక్రవారం మండలంలోని కొండభీమనపల్లి రైతు వేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇదే సందర్భంగా నూతన ఏడీఏగా భాధ్యతలు చేపట్టిన వీరప్పకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జానీయాదవ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, ఏఓ రవికుమార్, ఏఈఓ జగన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
కొండమల్లేపల్లి :టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యేను ఆ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రమావత్ తులసీరాం ఆధ్వర్యంలో స్థానిక కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ రవీంద్రకుమార్ నాయకత్వంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, సర్పంచ్ కుంభం శ్రీనివాస్గౌడ్, రైతు బంధు సమితి దేవరకొండ మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, శ్రీనునాయక్, రాంచందర్ పాల్గొన్నారు.