నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. 24వేల కాంట్రాక్ట్ కోసమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం పస్నూరు, నామానాయక్ తండా, చల్లవానికుంటకు చెందిన వందలాది మంది శుక్రవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీలో తిరిగే వారికి ఇక్కడేం పని అని ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్రెడ్డి ఆయా రాష్ర్టాల్లో తిరుగడం వల్లే మూడున్నరేండ్లుగా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గంలో 40,543 మందికి ఆసరా ఫించన్లు మంజూరు చేస్తే, అందులో 6,884 మంది దివ్యాంగులు ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి వైకల్యం భగవంతుడు పెట్టిన శాపం కాదని, ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీదేనని మండిపడ్డారు. ఫ్లోరోసిస్ ఇలాగే కొనసాగితే నల్లగొండ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా కేంద్రంలో కొలువుదీరిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఫ్లోరోసిస్ను మిషన్ భగీరథతో మటుమాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పునరుద్ఘాటించారు.
నాంపల్లి ఆగస్టు 19 : గత పాలకుల నిర్లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఫ్లోరైడ్తో ఇబ్బందులు పడ్డారని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించి ఆ సమస్య నుంచి విముక్తి కల్పించారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పస్నూర్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో పస్నూర్, నామానాయక్తండా, చల్లవానికుంట గ్రామాలకు చెందిన 350 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్లలో చేయలేని పనిని సీఎం కేసీఆర్ 6 సంవత్సరాల్లో ఫ్లోర్లిన్ భూతాన్ని పారదోలారని అన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అసమర్థత వల్లే మునుగోడు ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి పోయిందని తెలిపారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్న రాజగోపాల్రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి పోగుల వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మునుగల సుధకార్రెడ్డి, పానగంటి వెంకన్న, కడారి శ్రీశైలం, ఎస్కే అబ్బాస్, సపావత్ సర్దార్ నాయక్, నడింపల్లి యాదయ్య, కోన్రెడ్డి ఏడుకొండల్ ఉన్నారు.
మర్రిగూడ : మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజపేటతండా సర్పంచ్ నున్సావత్ సక్కుబాయిబిచ్చునాయక్ శుక్రవారం మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నాంపల్లి మండలం పస్నూరులో జరిగిన కార్యక్రమంలో రాజపేటతండా సర్పంచ్ భర్త బిచ్చునాయక్కు మంత్రి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఆయన టీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు ఉన్నారు.