రామగిరి, ఆగస్టు 19: చరిత్రకు సాక్ష్యం ఫొటో అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. 183వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్(టీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక పొటో వంద పదాలకు దర్పణం అన్నారు.
నేటి ఆధునిక కాలంలోనూ ఫొటోలకు ఆదరణ ఉందన్నారు. అనంతరం ఫొటోగ్రాఫర్స్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటరమణ, ఉపాధ్యక్షుడు కంది వేణుగోపాల్, జర్నలిస్టు సంఘాల నాయకులు మర్రి మహేందర్రెడ్డి, కోటగిరి దైవాదీనం, మహేందర్, రామకృష్ణ, మధు, టీపీజేఏ సహాయ కార్యదర్శి నగర భాస్కర్, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కారింగు శ్రీనివాస్, వెంకన్న, నాగరాజు, టీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కనగల్ : ఎస్ఎల్బీసీ డీ-37 కాల్వకు ప్రస్తుతం ఇస్తున్న 600 క్యూసెక్కుల నీరు సరిపోవడం లేదని, 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని పగిడిమర్రి గ్రామ యువకులు శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నేటి నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సింగం రమేశ్, రామలింగం, జానయ్యగౌడ్, స్వామి ఉన్నారు.
మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన కొన్రెడ్డి యాదమ్మ ఇల్ల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రూ.10,000 నగదు పంపించారు. స్థానిక ఎంపీటీసీ పులకరం ఆండాలూవెంకటేశం బియ్యం అందజేశారు. అదేవిధంగా పర్వతగిరికి చెందిన కదిరె సైదులు(45) శుక్రవారం మృతిచెందాడు.
ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే కంచర్ల రూ.10,000 నగదును పంపగా ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్ సైదులు కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదయ్యగౌడ్, జడ్పీటీసీ వెంకటేశంగౌడ్, ఆలయ మాజీ చైర్మన్ ఎన్ యాదగిరి, సర్పంచ్ అంజమ్మారామచంద్రు, ఎంపీటీసీ ఆండాలూవెంకటేశం, మాజీ ఎంపీటీసీ యాదగిరి, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.