నీలగిరి, ఆగష్టు 19 : మహనీయుల పోరాటాలు, ప్రాణ త్యాగం చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహనీయులను స్మరించుకుంటూ నేటి యువతకు తెలి యపరచడానికే వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించారని, 8 ఏళ్లలో అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లచ్చునాయక్, డా.ఏసీహెచ్ పుల్లారావు, సూర్యాపేట కౌన్సిలర్ భరత్మహజన్, టీఆర్ఎస్ నాయకులు వెంకన్న జాన్శాస్త్రి, జనార్దన్రావు ఉన్నారు.
చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆయన బాలసదన్, శిశుగృహలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సుభద్ర, సీడీపీఓ తూముల నిర్మల, బాలల పరిరక్షణ సమితి చైర్మన్ కృష్ణ, బాలల పరిరక్షణ అధికారి గణేశ్గౌడ్, సభ్యులు లక్ష్మీకిరణ్, ఐసీడీఎస్ సిబ్బంది నాగిరెడ్డి, శ్రీహరి, శిశుగృహా మేనేజర్లు సుష్మ, దుర్గాభవానీ, సోషల్ వర్కర్ రజిత, నర్సులు లక్ష్మీ, రేణుక, బాలసదన్ సూపర్వైజర్ జయమ్మ, సామ్రాజ్యం ఉన్నారు.
నల్లగొండ జిల్లా జైలులో లయన్స్క్లబ్ సహకారంతో ఖైదీలకు మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జైలు లోపలి పరిసరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జైలు ప్రత్యేక ఆహ్వానితులు మామిడి పద్మ, లింగయ్య, జైలు సూపరింటెండెంట్ దేవ్లా, జైలర్ అనిల్, డిప్యూటీ జైలర్ నరేశ్, లయన్స్క్లబ్ ఎస్పీటీ ప్లాటినమ్ క్లబ్ సభ్యులు ఉన్నారు.
నల్లగొండ రూరల్ : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భా గంగా జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పాఠశాల స్థాయి ఫ్రీడప్ కప్ పోటీలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని చాటేలా ఫ్రీడప్ కప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం విజేతలకు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, ఎంఈఓ కుక్కుట్ల నరసింహ, జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారి మగ్బూల్ ఆహ్మద్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎన్బీఆర్ ఫౌండేషన్ సహకారంలో స్థానిక ఎన్ఎస్పీ క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా(ప్రెస్ క్లబ్) కప్ను కైవసం చేసుకొంది. ఫైనల్కు చేరిన రెవెన్యూ ఉద్యోగుల జట్టు, ప్రెస్ క్లబ్ జట్లు శుక్రవారం తలపడగా రెవెన్యూ జట్టు పై 16 పరుగుల అధిక్యంతో మీడియా జట్టు విజయం సాధించింది. విజేతలకు గొర్రెల,మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమొట్ల బాలరాజుయాదవ్, ఎన్బీఆర్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు కప్ను అందజేశారు.