నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు15(నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన హంగూ ఆర్భాటాలు, డబ్బు హామీల మంత్రంతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అనతికాలంలోనే ఆయన వ్యవహారశైలిని అర్థం చేసుకున్న అనేకమంది కాంగ్రెస్ ముఖ్యులు ఆయనకు దూరంగా ఉంటూ వచ్చారు. మాటలు, డబ్బులతో మభ్యపెట్టడం తప్ప ఎందులోనూ చిత్తశుద్ధి లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు టీఆర్ఎస్లో చేరారు.
ఇక తాజాగా పైకి అభివృద్ధి పేరు చెబుతూ పార్టీ మారి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతుండడంతో మిగిలిన వారు సైత జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరికలకు క్యూ కట్టారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగుతున్నది 2018 ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన హంగు, ఆర్బాటాలు, డబ్బు హామీల మంత్రంతో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన అనతికాలంలోనే ఆయన వ్యవహారశైలిని అర్థం చేసుకున్న అనేక మంది కాంగ్రెస్ ముఖ్యులు ఆయనకు దూరంగా జరుగుతూ వచ్చారు. మాటలు, డబ్బులతో మభ్యపెట్టడం తప్పా, ఎందులోనూ చిత్తశుద్ధ్ది లేదంటూ పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఇక తాజాగా పైకి అభివృద్ధ్ది పేరు చెబుతూ పార్టీ మారి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతుండడంతో మిగిలిన వారు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
దాంతో వారం రోజులుగా పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు. మునుగోడు అభివృద్ధ్దితోపాటు వారి భవిష్యత్తుకు టీఆర్ఎస్ నుంచి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి భరోసా కల్పిస్తుండడంతో గులాబీ కండువాలు కప్పుకునేందుకు పోటీపడుతున్నారు. సోమవారం కూడా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ బొడ్డు శ్రావణీనాగరాజు తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వారితోపాటు సంస్థాన్నారాయణపురం మండలం కొత్తగూడెం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. సర్పంచ్ దోనూరి సుశీల, ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శేఖర్రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. ఇక చండూరు మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ వహీద్ కూడా కాంగ్రెస్కు రాంరాం చెప్పారు. వీరందరికీ నల్లగొండలో మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధ్ది టీఆర్ ఎస్తోనే సాధ్యమంటూ ముందుకు వస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసకుంట్ల ప్రభాకర్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధే కనిపిస్తున్నది. మిషన్ భగీరథ నీళ్లు, చర్లగూడెం రిజర్వాయర్, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర పనులు అప్పుడు జరిగాయన్నది తెలుసు. ఇక రాజగోపాల్రెడ్డి గెలిచిన నాటి నుంచి ఒక్క అభివృద్ధి పనిని కూడా చేపట్టలేకపోయారని, చర్లగూడెం రిజర్వాయర్ లాంటి పనులను సైతం అడ్డుకునే ప్రయత్నాలే చేశారనే భావన ఉంది. మరోవైపు తమ రాజకీయ భవిష్యత్తు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే అనే విశ్వాసం వీరిలో కనబడుతున్నది. దాంతో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరందరికీ భరోసా కల్పిస్తూ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
మునుగోడు చైతన్యానికి నిదర్శనం : మంత్రి
ఎప్పటికైనా మునుగోడు అభివృద్ధ్ది టీఆర్ఎస్తోనే సాధ్యమంటూ మునుగోడు ప్రజలు, ప్రజాప్రతినిధులు మరోసారి తమ చైతన్యాన్ని చూపెడుతున్నారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ రాజగోపాల్రెడ్డి మాయమాటలు నమ్మి మోస పోయినవారంతా ఆయన అసలు నిజాన్ని గ్రహించి టీఆర్ఎస్లోకి వస్తుండడం సంతోషకరమన్నారు. కేసీఆర్తోనే మునుగోడు శాశ్వత అభివృద్ధి సాధ్యమంటూ మునుగోడు ప్రజలు కనబరుస్తున్న విశ్వాసానికి తాజా చేరికలే నిదర్శమని వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ సభ అనగానే గ్రామాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు.
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ మహమ్మారికి చెక్ పెట్టి శాశ్వత పరిష్కారం కోసం చర్లగూడెం రిజర్వాయర్ నిర్మిస్తున్న కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసం ప్రజలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. రాజగోపాల్రెడ్డికి ఇవే చివరి ఎన్నికలని, తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసం మోసం చేసిన రాజగోపాల్రెడ్డిని మరోసారి నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధ్దంగా లేరన్నారు. మునుగోడు ప్రజల మేలు కంటే ఆయనకు సొంత కాంట్రాక్టులు, వ్యాపారాలే ముఖ్యమని విమర్శించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్లు బండ నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నార్కట్పల్లి ఎంపీపీ నరేందర్రెడ్డి ఉన్నారు.
14 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీల చేరిక
ఇప్పటికే 3, 4 రోజులుగా 14 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు, పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఇక ఈ నెల 20లోపు ఇంకా చాలా మంది కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేస్తానంటూ చేసిన వాగ్దానాలన్నీ బూటకమని, ఇన్నాళ్లూ ఆయన్ను మోసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. మూడున్నర ఏండ్లలో ఒక్క పైసా అభివృద్ధి నిధుల కోసం కృషి చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో ఎక్కడైనా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంపై నిందలేస్తూ తప్పించుకునే ప్రయత్నాలే చేస్తూ వచ్చారన్నది వాస్తవం.
ప్రభుత్వం నుంచి నిధుల ప్రయత్నాలను అలా ఉంచితే, సొంత డబ్బుతో చేస్తానన్న అభివృద్ధ్ది ఎటు పోయిందన్న దానికి కూడా ఆయన నుంచి సమాధానం లేదన్న చర్చ ఉంది. ఇక అక్కడక్కడ లక్షో, రెండు లక్షలో ఇచ్చి తానే వ్యక్తిగత అవసరాలకు అందజేసి వాటితోనే ప్రజలను మభ్యపెట్టాలని చూడడాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు ఆయన ప్రస్తుత తీరుపై మండిపడుతున్నారు. సొంత కాంట్రాక్టుల కోసం రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ శ్రేణులు విసిగిపోయాయి. ఇన్నాళ్లూ ఆయన మాటలు నమ్మితే నట్టేట ముంచాడంటూ అసలు నిజాన్ని గ్రహించిన వారంతా టీఆర్ఎస్లో చేరేందుకు చూస్తున్నారు.
గ్రామాభివృద్ధి కోసమే పార్టీలో చేరాను
ప్రభుత్వాలు మారిన కొత్తగూడెం గ్రామపంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది.మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కొత్తగూడెం గ్రామపంచాయతీ అభివృద్ధి చేసుకోవడం కోసమే టీఆర్ఎస్లో చేరాను.
దోనూరి సుశీల, సర్పంచ్, కొత్తగూడెం