నడిగూడెం, ఆగస్టు 12 : పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తీసుకు వచ్చారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని కరివిరాల, కాగిత రామచంద్రాపురం, సిరిపురం గ్రామాల్లో నిర్మించిన 130 డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదల కోసం అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్న పేద ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి వీలుగా త్వరలో రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, చీరను అందించారు. మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్కుమార్, కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి, ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, ఎంపీడీఓ ఎర్రయ్య, తాసీల్దార్ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్లు పుట్టా రమేశ్, రాజేశ్, సురేశ్ ప్రసాద్, పాలడుగు ప్రసాద్, ఆంజనేయులు, గడ్డం మల్లేశ్యాదవ్, యలగొండ నాగేశ్వర్రావు, అధికారులు పాల్గొన్నారు.