నందికొండ, ఆగస్టు 9 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,30,944 క్యూసెక్కల ఇన్ఫ్లోతో సాగర్కు వస్తున్నది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా 63,046 క్యూసెక్కులు, 6 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,67,898 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగకులకు గాను 577.20 (274.9404 టీఎంసీ) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయికి చేరేందుకు 13 (38 టీఎంసీలు) అడుగులు మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ ఎడమ కాల్వ ద్వారా 2,557 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 2,236, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 26,127, వరద కాల్వ ద్వారా 300, ఎస్ఎల్బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 31,820 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.
నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా మంగళవారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు 4 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 6,589.06 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి కాల్వకు 101.58 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 101.58 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 5,302.55 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 638.40 అడుగులు (2.86 టీఎంసీలు)గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.